Kethireddy Pedda Reddy: ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతా
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ఈనాడు డిజిటల్, అనంతపురం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ జేసీ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతపురం ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను అవినీతికి పాల్పడుతున్నట్లుగా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని.. ఇలాంటి వాటిని ఇకపై సహించేది లేదని పేర్కొన్నారు. ‘ప్రజలందరినీ భయపెట్టాలనేది నా ఉద్దేశం కాదు. జేసీˆ కుటుంబం, వారి వెంట తిరిగే కొంతమందిని లక్ష్యంగా పెట్టుకుంటాం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రెండు, మూడు నెలల్లో వేట మొదలు పెడతాం. చేతనైతే ఎదుర్కోండి. నేను రైతు బిడ్డను. పంటకు పురుగుపడితే ఎలా తీసేయాలో తెలుసు. రాజకీయాలు భ్రష్టు పడితే ఏ విధంగా తొలగించాలో కూడా తెలుసు. ఇది సమయం కాదనే ఊరుకుంటున్నా. తాడిపత్రిలో శాంతిభద్రతలను కాపాడాలనే ఆలోచనతో ఉన్నాం. ఎన్నికలు అయ్యేంతవరకు అదే ఆలోచనతో ఉంటాం. ఎన్నికలు ముగిసిన రెండు, మూడు నెలల్లో 1985 నుంచి 2004 వరకు ఎలా ఉన్నానో ఆ రూపాన్ని చూపిస్తాం. నేను నా పాత జీవితాన్ని మర్చిపోతే దారినపోయే వారు కాలితో తంతారు. అందుకే పాత జీవితంలోకి ఒకసారి మళ్లీ వెళ్లాలనే ఆలోచన ఉంది. దారిన పోయే ప్రతి ఒక్కరూ రాయి వేస్తుంటే ఓపిక నశిస్తోంది. తిరిగి కొట్టే సాహసం నాకుంది. 60 ఏళ్ల వయసులో అన్నీ మానుకోవాలనే ఉద్దేశంతో ఆపేశాం. తాడిపత్రిలో నాలుగున్నరేళ్లలో మార్పు తీసుకొచ్చాం’ అని వ్యాఖ్యానించారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్ద ఎత్తున ఇసుక, భూములు దోచుకున్నారని, తాడిపత్రిలో అవినీతికి పాల్పడ్డారని కొందరు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన జేసీˆ కుటుంబానికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా