Botsa: షర్మిల మాటలు వింటుంటే జాలేస్తుంది: బొత్స
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాటలు వింటుంటే జాలి వేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
త్వరలో డీఎస్సీ ప్రకటన మంత్రి బొత్స సత్యనారాయణ
శ్రీకాకుళం నగరం, న్యూస్టుడే: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాటలు వింటుంటే జాలి వేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘షర్మిల కొత్తగా ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు మాట్లాడిన మాటలే ఆమె అంటున్నారు తప్ప అందులో కొత్తదనం ఏముంది? ప్రత్యేక హోదా ఎవరు తాకట్టు పెట్టారు. ప్యాకేజీ ఎవరడిగారు? ప్యాకేజీ చాలని ఎవరు రాసిచ్చారు? నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాదా? షర్మిల ఆ విషయాలు మర్చిపోయి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఎంత వరకు సమంజసం. కేంద్రం వద్ద వైకాపా ప్రభుత్వం సాగిలపడలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సద్భావన విధానంతో వెళ్తున్నాం. ఎవరి రాజకీయ విధానం వారికి ఉంటుంది. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది మా విధానం. అమరావతి మాత్రమే రాజధాని కావాలన్నది భాజపా విధానం. మరో 70 రోజులు ఆగితే ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలుస్తుంది’ అని అన్నారు. అనంతరం ఉపాధ్యాయ నియామకాలకు గురించి మంత్రిని ప్రశ్నించగా డీఎస్సీ ప్రకటన రేపే వస్తుందని ముందు చెప్పారు. ఆ తరువాత త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. రాజ్యసభ ఎన్నికలకు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం