TDP-Janasena-BJP: సీట్ల సర్దుబాటుపై నేడూ చర్చ!
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లతో చర్చలు జరిపారు.
అమిత్షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ
అర్ధరాత్రి వరకు కొనసాగిన సమాలోచనలు
7 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న భాజపా!
సీట్ల కేటాయింపుపై రాని స్పష్టత
ఎన్డీయేలో తెదేపా చేరిక ఖాయమైనట్లే!
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లతో చర్చలు జరిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర చేర్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా తెదేపాను తిరిగి ఎన్డీయేలో చేర్చుకొనే అంశంపై కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిహార్లో నీతీష్కుమార్, ఉత్తర్ప్రదేశ్లో ఆర్ఎల్డీ నేత జయంత్చౌధరిని ఎన్డీయేలో చేర్చుకున్న భాజపా అగ్రనేతలు రేపోమాపో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీనీ చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేశారు. అదే క్రమంలో తెదేపాతో జట్టు కట్టడానికీ సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో సీట్ల సర్దుబాటుపై అమిత్షా, నడ్డాలు గురువారం రాత్రి చంద్రబాబు, పవన్కల్యాణ్లతో చర్చించినట్లు సమాచారం. గురువారం రాత్రి 10.30 నుంచి 12.10 వరకు వీరి చర్చలు కొనసాగాయి.
మరోవైపు.. రాష్ట్రంలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించడం, ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం కూడా పూర్తయింది. మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో భాజపాకు కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరిగింది. భాజపాకు 4 ఎంపీ సీట్లు, 6 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని తెదేపా యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెదేపా నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మరో దఫా సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి ఎన్డీయేలో తెదేపా చేరిక ఖరారైనట్లే కనిపిస్తోంది.
నెల రోజుల తర్వాత..
గత నెల 7న అమిత్షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు ఓ దఫా చర్చలు జరిపారు. తాజాగా మరోమారు చర్చల కోసం ఆయన హైదరాబాద్ నుంచి గురువారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి రాత్రి వచ్చారు. తర్వాత ఇద్దరూ కలిసి అమిత్షా నివాసానికి చేరుకొని చర్చల్లో పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో భాజపాకు తెదేపా 4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఇప్పుడు ఆ పార్టీ 7 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కూటమిలో జనసేన కూడా ఉండటం, ఇప్పటికే ఆ పార్టీకి 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినందున భాజపాకు అడిగినన్ని సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదన్న వాదన తెదేపా వైపు నుంచి వినిపిస్తోంది. మొత్తంగా బీజేపీ, జనసేనలకు కలిపి 7 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని, చర్చల అనంతరం ఈ సంఖ్యలో కొంత అటూ ఇటూ మార్పు ఉండొచ్చని అంటున్నారు. అయితే ఈ అంశంపై భాజపా అగ్రనేతలే చర్చలు జరుపుతున్నందున ఆ పార్టీలోని రాష్ట్ర స్థాయి నాయకులెవరూ స్పందించడంలేదు. ఎంపీ రామ్మోహన్నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి దిల్లీ వచ్చిన చంద్రబాబును ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణరాజు కలిసి మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్