మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థిగా నవీన్కుమార్రెడ్డి
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు భారాస అభ్యర్థిగా ఎన్.నవీన్కుమార్రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
ఈనాడు, హైదరాబాద్, మహబూబ్నగర్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు భారాస అభ్యర్థిగా ఎన్.నవీన్కుమార్రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మొదళ్లగూడకు చెందిన నవీన్కుమార్రెడ్డి 2014లో అప్పటి పూర్వ మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు నుంచి కాంగ్రెస్ తరఫున జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది జడ్పీ వైస్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో షాద్నగర్ టిక్కెట్ ఆశించి భంగపడటంతో భారాసలో చేరారు. తాజా ఉపఎన్నికకు ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన మాజీ ఎమ్మెల్యేల్లో ఒకరిని బరిలో నిలపాలని పార్టీ భావించినప్పటికీ చివరకు నవీన్రెడ్డి పేరు ఖరారైంది. 2021 నవంబరులో పూర్వ మహబూబ్నగర్లో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ పడింది. అప్పుడు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇందులో గెలిచిన అభ్యర్థి 2028 జనవరి 4 వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
మల్కాజిగిరి.. విలక్షణమే ప్రతిసారీ
-
అమరావతి కోసమే పశ్చిమ సీటు ఇచ్చేశా: పవన్ కల్యాణ్
-
కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి.. కారు బోల్తాపడి పార్టీ నాయకురాలి దుర్మరణం
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
-
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
-
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం