Mudragada: రెండ్రోజుల్లో ఒక్కడినే వైకాపాలో చేరతా: మాజీ మంత్రి ముద్రగడ

ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో ఈనెల 15, 16వ తేదీల్లో ఏదో ఒకరోజు తానొక్కడినే వెళ్లి వైకాపాలో చేరనున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు.

Updated : 14 Mar 2024 14:15 IST

కిర్లంపూడి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో ఈనెల 15, 16వ తేదీల్లో ఏదో ఒకరోజు తానొక్కడినే వెళ్లి వైకాపాలో చేరనున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. బుధవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈనెల 14న వైకాపాలో చేరతానని, తనతో ప్రయాణించాలనుకునేవారు రావాలంటూ తొలుత తాను ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చిందని అన్నారు. వేల మందిని తాడేపల్లికి సీఎం వద్దకు తీసుకెళ్లడం భద్రత రీత్యా ఇబ్బంది అవుతుందని భావించి గురువారంనాటి పర్యటనను వాయిదా వేసుకున్నానని అన్నారు. రెండు రోజుల్లో తానొక్కడినే వెళ్లి చేరతానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని