బిహార్‌లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి

లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికంగా భాజపా 17 స్థానాల్లో పోటీ చేయనుంది.

Published : 19 Mar 2024 03:11 IST

17 చోట్ల భాజపా, 16 స్థానాల్లో జేడీయూ పోటీ
ఎల్జేపీ (రాంవిలాస్‌)కు 5 సీట్లు 

పట్నా: లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికంగా భాజపా 17 స్థానాల్లో పోటీ చేయనుంది. సీఎం నీతీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూ 16, చిరాగ్‌ పాసవాన్‌కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్‌) పార్టీ ఐదు స్థానాల్లో బరిలో దిగేందుకు అంగీకారం కుదిరింది. హిందుస్థానీ అవామ్‌ మోర్చా, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్ర్రీయ లోక్‌మంచ్‌ పార్టీలు చెరో స్థానంలో పోటీ చేస్తాయని భాజపా బిహార్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి వినోద్‌ తావడే వెల్లడించారు. ఈమేరకు ఆయన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలతో కలిసి దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. జేడీయూ కన్నా ఎక్కువ సంఖ్యలో భాజపా సీట్లు తీసుకోవడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో మారిన సమీకరణాలకు దీన్ని నిదర్శనంగా భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో భాజపా, జేడీయూలు చెరో 17 స్థానాల్లో పోటీ చేశాయి. నాటి అవిభాజ్య ఎల్జేపీ ఆరు చోట్ల బరిలోకి దిగింది. భాజపా, ఎల్జేపీలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందగా.. జేడీయూ 16 చోట్ల విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని