గెలుపే లక్ష్యంగా పని చేయాలి

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు.

Published : 19 Mar 2024 04:52 IST

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

ఈనాడు, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన జనసేన నాయకులతో సమావేశమయ్యారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో పోటీకి అవసరమైన ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. కేవలం జనసేన పోటీ చేసే స్థానాలే కాకుండా తెదేపా, భాజపా పోటీ చేసే స్థానాల్లోనూ ప్రచారంలో పాల్గొని వారి విజయానికి కృషి చేయాలన్నారు. పొత్తులో భాగంగా పలువురు నాయకులకు సీట్లు సర్దుబాటు చేయలేకపోయారని, విశాల దృక్పథంతో ఆలోచించి కూటమి విజయంలో భాగస్వాములు కావాలని ఆయన నాయకులను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని