తేజస్వీ చేప తింటున్న వీడియోపై వివాదం
ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రయాణం చేస్తున్న సమయంలో భోజనంలో భాగంగా చేప తింటూ తీసుకున్న వీడియోపై భాజపా నాయకులు, కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
వసంత నవరాత్రి సమయంలో ఇదేమిటన్న భాజపా నాయకులు, కొందరు నెటిజన్లు
ప్రత్యర్థుల తెలివి తక్కువతనాన్ని బయటప్టెటడంలో విజయం సాధించానన్న బిహార్ మాజీ డిప్యూటీ సీఎం
పట్నా: ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రయాణం చేస్తున్న సమయంలో భోజనంలో భాగంగా చేప తింటూ తీసుకున్న వీడియోపై భాజపా నాయకులు, కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. వసంత నవరాత్రి సమయంలో ఇదేమిటని మండిపడ్డారు. తేజస్వీ యాదవ్ ‘సీజనల్ సనాతన వాదని’, ఆయన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సహా పలువురు భాజపా నేతలు విమర్శించారు. ఆ విమర్శలపై స్పందించిన బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి.. వసంత నవరాత్రికి ముందే చిత్రీకిరించిన వీడియో అదని, తన పేరు చెడగొట్టేందుకు ప్రయత్నించేవారి తెలివితక్కువతనాన్ని బహిర్గతం చేయడంలో విజయం సాధించానని వ్యాఖ్యానించారు. చేపను తింటున్న వీడియోను ఆయనే మంగళవారం ట్విటర్లో పోస్ట్ చేశారు. బిహార్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్బంధన్లో తాజాగా ప్రవేశించిన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ముకేశ్ సాహ్నీతో కలిసి హెలికాప్టర్లో ప్రయాణించిన తేజస్వీ.. ఆ సందర్భంగా భోజనం చేయడం కనిపించింది. యాదవులు, సంప్రదాయంగా చేపలు పట్టే వృత్తిలో ఉండే ‘నిషాద్’ సామాజికవర్గాల ఓట్లను ఆకర్షించేందుకు ఇద్దరు నేతలు ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు