Harish Rao: తెలంగాణ ఆచరిస్తే.. దేశమంతా అనుసరించేలా కేసీఆర్ చేశారు: హరీశ్రావు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిససి హరీశ్ రావు ప్రారంభించారు.
మహేశ్వరం: నాడు తెలంగాణలో 3 మెడికల్ కళాశాలలే ఉండేవని.. ఇప్పుడు ఆ సంఖ్య 33కు చేరిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటే ముఖ్యమంత్రికి ఎంతో గౌరవం. ఆమె అడగగానే జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారు. ఎదిగిన నాయకురాలు ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మహేశ్వరం నియోజకవర్గంలో 550 పడకలతో ఆస్పత్రి నిర్మాణం చేపడతాం. వారం పది రోజుల్లో మహేశ్వరం మెడికల్ కళాశాల శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తాం. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు కొందరైతే.. ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకురాలు సబిత. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆమె ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం సబితా ఇంద్రారెడ్డికి సవాల్ లాంటిది. ఎన్నో విద్యా సంఘాలతో నవ్వుతూ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తుంటారు.
ప్రస్తుతం దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. చెరువుల అభివృద్ధిలో కర్ణాటక మనల్ని కాపీ కొడుతోంది. తెలంగాణ ఆచరిస్తే.. దేశం మొత్తం అనుసరించేలా కేసీఆర్ చేశారు.
మూడు గంటలు కరెంట్ ఇస్తే మూడు ఎకరాలు పారుతుందో లేదో రైతులు చెప్పాలి. 3 గంటలు కరెంట్ కావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలి. 24 గంటలు కరెంట్ కావాలంటే కేసీఆర్కు ఓటు వేయండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తత తీసుకున్న తిమ్మాపూర్లో రూపాయి పనిచేయలేదు. బావుల వద్ద మీటర్లు పెట్టలేదని తెలంగాణకు కేంద్రం రూ.35వేల కోట్ల ఆపింది. రైతు రుణాలను లక్ష రూపాయల వరకు పూర్తిగా మాఫీ చేస్తాం. 24 గంటల నిరంతర విద్యుత్ కోసం కేసీఆర్ మ్యాజిక్ చేయలేదు, మంత్రం వేయలేదు.
ఆయన కష్టపడటం వల్లే 24 గంటల కరెంట్ రైతులకు అందుతోంది. రంగారెడ్డి జిల్లాలో 95 వేల మంది మహిళలకు వడ్డీతో సహా అభయహస్తం డబ్బులు వారం రోజుల్లోగా ఖాతాల్లో పడతాయి’’ అని హరీశ్రావు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్