Harish Rao: పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేక ట్రస్టు: హరీశ్‌రావు

కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Published : 11 Jan 2024 20:12 IST

హైదరాబాద్‌: కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కేవలం భారాస వల్లే సాధ్యం అవుతుందన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్‌ శాఖలో అవినీతి జరిగిందని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీకి ట్రైలర్‌ చూపించాం. ఇకముందు అసలు సినిమా చూపిస్తాం. పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్టు ఏర్పాటు చేస్తాం. అక్రమ కేసుల నుంచి వారిని కాపాడేందుకు లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని