HD Kumaraswamy: భాజపాతో కలిసి పనిచేస్తామన్న కుమారస్వామి.. ఎన్డీయే కూటమిలోకి జేడీఎస్ వెళ్లే సూచన!
కర్ణాటకలో (Karnataka) జేడీఎస్ (JDS) క్రమంగా భాజపాకు (BJP) దగ్గరవుతోంది. లోక్సభ ఎన్నికల నాటికి ఆ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా భాజపాతో (BJP) కలిసి పని చేస్తామని జేడీఎస్ (JDS) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) ప్రకటించారు. జేడీఎస్కు సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే అధికారం మాజీ ప్రధాని దేవెగౌడ తనకే ఇచ్చారన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఈలోగా కర్ణాటకలో ప్రతిపక్షంగా కొనసాగుతూ భాజపాతో కలిసి అధికార కాంగ్రెస్పై (Congress) పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
గురువారం రాత్రి శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ప్రధాని దేవెగౌడ సైతం హాజరయ్యారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందే భాజపాతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంటుందనే వార్తల నేపథ్యంలో ఆయన హాజరు ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘అసెంబ్లీ లోపల, బయట భాజపా, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలని ఇదివరకే చెప్పాను. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భాజపాతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ ఉదయం సైతం ఎలా ముందుకెళ్దామనే అంశంపై మా పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి చర్చించామని’ కుమారస్వామి వెల్లడించారు. లోక్సభ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉందని, ఎన్నికలు వచ్చే వరకు వేచి చూస్తామన్నారు.
అర్వింద్.. 24 గంటల సమయం ఇస్తున్నా: ఎమ్మెల్సీ కవిత సవాల్
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ఈ మేలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ సొంతంగా 135 స్థానాలు సాధించి అధికారం చేజిక్కించుకుంది. భాజపా 66, జేడీఎస్ 19 స్థానాలకు పరిమితం కావడంతో ప్రతిపక్షంలో కొనసాగుతున్నాయి. దేశంలో రాజకీయ పునరేకీరణలో భాగంగా ఈ వారంలో ఎన్డీయే, ఇండియా కూటముల్లో పార్టీలు భారీగా చేరాయి. ఏ కూటమిలోనూ చేరని పార్టీలు 11 కాగా.. అందులో జనతాదళ్ (ఎస్) సైతం ఉంది. పార్టీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం దేవెగౌడ తనకే ఇచ్చారని చెబుతున్న కుమారస్వామి లోక్సభ ఎన్నికల నాటికి ఎన్డీయే వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు