Arvind Kejriwal: నేను ప్రజల మనిషిని.. అదే వాళ్లకు నచ్చట్లేదు: కేజ్రీవాల్
తనపై ప్రజలు చూపిస్తున్న అభిమానం.. కేంద్రంలోని భాజపా పెద్దలకు సమస్యగా మారిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అధికార భాజపా లక్ష్యంగా పలు విమర్శలు చేశారు.
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికలకు తోడు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)కు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్, భాజపా ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. కేజ్రీవాల్ లక్ష్యంగా భాజపా విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా.. ఆప్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. మంగళవారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ భాజపాపై విమర్శలు గుప్పించారు. ‘‘ప్రజలు నన్ను అభిమానించడం వారి నచ్చడంలేదు. అందుకే, నాపై ఏవేవో విమర్శలు చేస్తున్నారు’’ అని అన్నారు. ఆప్ అవినీతిపరుల పార్టీ అని భాజపా చేస్తున్న ఆరోపణలపై ఆయన దీటుగా స్పందించారు. ‘‘పంజాబ్ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ టెర్రరిస్ట్ అని ప్రధాని మోదీ అన్నారు. దానిపై విచారణ చేస్తామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇప్పడు, గుజరాత్ అసెంబ్లీ, దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రావడంతో కేజ్రీవాల్ అవినీతిపరుడు అని మళ్లీ ఆరోపిస్తున్నారు. మీ ఆరోపణలు నిజమైతే నన్ను వెంటనే అరెస్టు చేయండి ’’ అని కేజ్రీవాల్ భాజపాకు సవాల్ విసిరారు. ‘‘కేజ్రీవాల్ టెర్రరిస్టు కాదు, అవినీతిపరుడు కాదు.. ఆయన ప్రజలకు ఇష్టమైనవాడు. భాజపాకు ఆయనతోనే సమస్య’’ అని వ్యాఖ్యానించారు.
గత కొద్దిరోజులుగా ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు. పంజాబ్, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సంద్భంగా ఆప్కు భారీ మొత్తంలో నగదు అందజేసినట్లు తెలిపాడు. అతడి ఆరోపణలనే భాజపా విమర్శనాస్త్రాలుగా మలచుకుంది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆప్ అన్నిస్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లలో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికే ఆప్ సీఎం అభ్యర్థిగా టీవీ యాంకర్ ఇసుదాన్ గఢ్వీని ఎంపిక చేసింది. డిసెంబర్ 1న తొలి దశ పోలింగ్, డిసెంబరు 5న రెండో విడత జరగనుంది. డిసెంబరు 8న హిమాచల్ ప్రదేశ్తో పాటే ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మరోవైపు దిల్లీ పురపాలక సంఘంలో 250 కార్పొరేషన్ స్థానాలకు డిసెంబర్ 4న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్7న ఫలితాలు ప్రకటించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..