Gujarat Election 2022: మా సీఎం ఎవరో తెలియదు..మా సీఎం, పీఎం మోదీనే
మోదీయే మా సీఎం, పీఎం గ్రామీణ స్థాయిలో చాలా మంది ప్రజల మాట ఇది. అంతలా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారాయన. తాజా ఎన్నికల్లోనూ ప్రజలు ఆయన బ్రాండ్ను చూసే ఓటు వేశారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: కచ్.. గుజరాత్లోని ఓ మారుమూల ప్రాంతం. అక్కడికి వెళ్లి.. మీ సీఎం ఎవరు? అని ప్రశ్నిస్తే వాళ్లంతా ‘ఏమో మాకేం తెలుసు’ అని సమాధానమిస్తారు. అదే.. మీ ప్రధాని ఎవరు? అంటే ముక్త కంఠంతో ‘మోదీ’ అని చెబుతారు. ‘మా సీఎం, పీఎం ఆయనే’ అందరిదీ ఇదే మాట. గుజరాత్ ప్రజల్లో మోదీ స్థానం అలాంటిది. కుటుంబంలో ఓ వ్యక్తిగా ప్రజల్లో మమేకమైపోయారు.
ప్రధాని మోదీ.. రాష్ట్రంలో క్రియాశీల రాజకీయాలను వదిలి.. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆయన ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. మూడు విడతల్లో దాదాపు 13 ఏళ్లపాటు ఆయన గుజరాత్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. ఆ తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మోదీ తర్వాత ఆనందీబెన్ పటేల్, విజయ్ రూపానీ, గత ఏడాది సెప్టెంబరులో భూపేంద్ర పటేల్ సీఎం బాధ్యతలు చేపట్టారు. కానీ, వీరికి గ్రామీణ స్థాయిలో పెద్దగా గుర్తింపు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ మోదీనే తమ సీఎం అని చాలా మంది విశ్వసిస్తుంటారు.
ప్రజల విశ్వాసాన్ని మోదీ కూడా ఏనాడూ వమ్ము చేయలేదు. జాతీయ రాజకీయాల్లో, ప్రధానిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, రాష్ట్రం గురించి ఏమాత్రం ఏమరపాటుతో వ్యవహరించలేదు. ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధిని గురించి ఆరా తీస్తూ అవసరమైన మార్పులు సూచిస్తున్నారు. రాజకీయంగానూ నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలియగానే.. ఆయన స్థానంలో ఎన్నికలకు ముందు భూపేంద్ర పటేల్కు పగ్గాలు అప్పగించారు. తాను గుజరాతీనైనందుకు ఎంతగానో గర్విస్తున్నాని, గుజరాతీగానే ఉంటానంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన ఆయన అక్కడి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకోక ముందు నుంచే ప్రజలతో మరింతలా మమేకమయ్యేందుకు మోదీ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరిట రాష్ట్రంలో పర్యటించి..తాను ఇంకా రాష్ట్ర రాజకీయాలను వదలిపెట్టలేదనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాదాపు 20 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి.. తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్నంతలా ప్రచారం చేశారు. మోదీ బాండ్ర్ ఇమేజ్ తోనే భాజపా ఇంతటి ఘన విజయం సాధించిందనడం ఎవరూ కాదనలేని వాస్తవం.
కేవలం రాజకీయంగానే కాకుండా అభివృద్ధి పరంగానూ మోదీ స్వరాష్ట్రంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వివిధ రకాల ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. విద్య, వైద్యం, ఎలక్ట్రానిక్స్,సాంకేతికత ఇలా అన్ని రంగాల్లోనూ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడానికి ప్రధాన కారణం మోదీ అనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. గత పదేళ్లలో కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ. 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ ఒక్కటే కాదు అదానీ, టాటా లాంటి పెద్ద పెద్ద సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయంటే కారణం మోదీయే. ముంబయి నుంచి దిల్లీ వరకు చేపట్టిన ఎక్స్ప్రెస్ హైవేను అహ్మదాబాద్, వడోదర, సూరత్ మీదుగా మళ్లించారు. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా ఉపాధి, ఉద్యోగాల కల్పన పేరుతో గ్రామీణ ప్రజల మనసుల్లోనూ మోదీ చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకే గ్రామీణస్థాయిలో మోదీ పేరుతోనే ఆ పార్టీ నాయకులు ఓట్లు అభ్యర్థించారు.
‘‘దిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే’’ అన్న చందంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా ప్రధాని మోదీ మాత్రం తన రాష్ట్రంపై అభిమానాన్ని వదులుకోలేదు. అలాగే అక్కడి ప్రజలు కూడా సీఎం ఎవరైతే మాకేంటి? మాకు అండగా మోదీ ఉన్నారు.. ఆయనే మా సీఎం.. పీఎం అంటూ ఏకంగా రికార్డు స్థాయిలో 156 స్థానాలను కట్టబెట్టారు. క్షేత్రస్థాయిలో ఎంతో మంది నాయకులు, స్టార్ క్యాంపెయినర్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు ప్రచారంలో భాగం అయ్యుండొచ్చు. కానీ, మోదీ బ్రాండ్తోనే ప్రజలు భాజపాకు ఓటు వేశారనడం కాదనలేని నిజం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్