Janasena: పాలకొండ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

ఎట్టకేలకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. 

Updated : 09 Apr 2024 22:41 IST

అమరావతి: ఎట్టకేలకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన పాలకొండ బరిలో నిమ్మక జయకృష్ణను నిలపనున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. నియోజకవర్గం నుంచి ఆశావహులు ఎక్కువ మంది ఉండటంతో పలు దఫాలుగా సమీక్షలు, సర్వేలు నిర్వహించామని పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేల్లో అత్యధిక మంది మద్దతు తెలపడంతో జయకృష్ణను అధినేత ఎంపిక చేసినట్టు వెల్లడించాయి. తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని