Janasena: పాలకొండ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
ఎట్టకేలకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది.
అమరావతి: ఎట్టకేలకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన పాలకొండ బరిలో నిమ్మక జయకృష్ణను నిలపనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. నియోజకవర్గం నుంచి ఆశావహులు ఎక్కువ మంది ఉండటంతో పలు దఫాలుగా సమీక్షలు, సర్వేలు నిర్వహించామని పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేల్లో అత్యధిక మంది మద్దతు తెలపడంతో జయకృష్ణను అధినేత ఎంపిక చేసినట్టు వెల్లడించాయి. తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.