Janasena: పవన్‌ సమక్షంలో.. జనసేనలో చేరిన పృథ్వీరాజ్‌, జానీ మాస్టర్‌

సినీనటుడు పృథ్వీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ జనసేనలో చేరారు.

Updated : 24 Jan 2024 19:34 IST

అమరావతి: కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, సినీనటుడు పృథ్వీరాజ్‌ (Prudhvi Raj) జనసేనలో చేరారు. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. వీరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్‌, పృథ్వీ చేరికపై పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పవన్‌.. వారికి సూచించారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ నటించిన బ్రో చిత్రంలో పృథ్వీరాజ్‌.. మంత్రి అంబటి రాంబాబు తరహాలో నృత్యం చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు