Telangana news: రాజగోపాల్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారు: జీవన్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి సెమీ ఫైనల్ లాంటిదని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అక్కడ విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వం
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి సెమీ ఫైనల్ లాంటిదని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అక్కడ విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తామేనని ఆశాభావం వ్యక్తంచేశారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన ఆయన.. తెరాస మునిగిపోయే పడవ అన్నారు. కాంగ్రెస్ గోవు లాంటిది, భాజపా పులి లాంటిదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గుర్తు చేశారు. పాలిచ్చే, పూజించే గోవును వదిలి పులి వద్దకు వెళ్తే ఏమవుతుందని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేసినందుకు భాజపాకు ఓటేయాలా? అన్నింటిధరలు పెంచినందుకు, తెలంగాణ ఏర్పాటును కించపరిచినందుకు ఓటేయాలా? అని ప్రశ్నించారు.
దేశంలో సైనికులకు వేతనాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్కు సెమీఫైనల్లాంటిదని.. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్ ఉపయోగించుకోలేదని.. మూడున్నరేళ్లలో ప్రజలకోసం ఆయన చేసిన ఉద్యమం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. ఆయన ఫైట్చేస్తానంటే కాంగ్రెస్ అడ్డుపడిందా? అని నిలదీశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక అసెంబ్లీలో అడుగు పెట్టరని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..