Telangana news: రాజగోపాల్‌ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారు: జీవన్‌ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి సెమీ ఫైనల్‌ లాంటిదని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. అక్కడ విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వం

Updated : 08 Aug 2022 16:31 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి సెమీ ఫైనల్‌ లాంటిదని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. అక్కడ విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తామేనని ఆశాభావం వ్యక్తంచేశారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన ఆయన.. తెరాస మునిగిపోయే పడవ అన్నారు. కాంగ్రెస్‌ గోవు లాంటిది, భాజపా పులి లాంటిదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి గుర్తు చేశారు. పాలిచ్చే, పూజించే గోవును వదిలి పులి వద్దకు వెళ్తే ఏమవుతుందని ప్రశ్నించారు. రాజగోపాల్‌ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రద్దు చేసినందుకు భాజపాకు ఓటేయాలా? అన్నింటిధరలు పెంచినందుకు, తెలంగాణ ఏర్పాటును కించపరిచినందుకు ఓటేయాలా? అని ప్రశ్నించారు. 

దేశంలో సైనికులకు వేతనాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందని జీవన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు సెమీఫైనల్‌లాంటిదని..  2023లో తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపుఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్‌ ఉపయోగించుకోలేదని.. మూడున్నరేళ్లలో ప్రజలకోసం ఆయన చేసిన ఉద్యమం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. ఆయన ఫైట్‌చేస్తానంటే కాంగ్రెస్‌ అడ్డుపడిందా? అని నిలదీశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇక అసెంబ్లీలో అడుగు పెట్టరని వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని