Kamal Haasan: లోక్సభ ఎన్నికల్లో మేం పోటీ చేయట్లేదు: కమల్హాసన్
Kamal Haasan: లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని మక్కల్ నీది మయం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ వెల్లడించారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
చెన్నై: సార్వత్రిక ఎన్నికలు (Loksabha Elections 2024) దగ్గరపడుతున్న వేళ సీట్ల పంపకాలపై రాజకీయ కూటములు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నాయి. తమిళనాడు (Tamil nadu)లో అధికార డీఎంకే (DMK), కాంగ్రెస్ (Congress) మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైంది. తాజాగా ఈ కూటమిలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)కు చెందిన మక్కల్ నీది మయం (MNM) పార్టీ కూడా చేరింది.
ఈ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కమల్ హాసన్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై వీరిద్దరూ చర్చలు జరిపారు. 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది.
ఈ సమావేశం అనంతరం కమల్హాసన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు ఎలాంటి పదవులు వద్దు. దేశ ప్రయోజనాలను కాంక్షించి కూటమిలో చేరా. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం లేదు. డీఎంకే-కాంగ్రెస్ కూటమికే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా’’ అని వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కూటమి తరఫున ఎంఎన్ఎం పార్టీ ప్రచారం చేయనుంది.
ఇక, ఈ సాయంత్రం డీఎంకే, కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీని తర్వాత రాష్ట్రంలో విపక్ష ఇండియా కూటమి పార్టీల సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటక చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా తమిళనాడులో కాంగ్రెస్కు 10 సీట్లు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీపీఐ, సీపీఎంలకు రెండు చొప్పున స్థానాలను ఇవ్వనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.