Kishan Reddy: అధిష్ఠానాన్ని ఏదీ అడగలేదు.. పార్టీయే గుర్తించి ఇచ్చింది: కిషన్రెడ్డి
పార్టీని ఎప్పుడూ ఏదీ అడగలేదని.. అధిష్ఠానం గుర్తించి ఇచ్చిన అన్ని బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించానని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.
దిల్లీ: తాను పార్టీని ఎప్పుడూ ఏదీ అడగలేదని.. అధిష్ఠానం గుర్తించి ఇచ్చిన అన్ని బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించానని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భాజపా చీఫ్గా నియమించిన తర్వాత.. తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘మొదటిసారి ఎంపీగా గెలిచా. నాలుగేళ్లలో సుమారు రెండేళ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చేశాను. కేంద్ర మంత్రిగా ప్రధాని మోదీ నాకు బాధ్యతలు ఇచ్చారు. దీంతో మరో రెండేళ్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా చేశాను. ఎప్పుడూ పార్టీని ఏదీ అడగలేదు. మంత్రి అవుతానని.. కావాలని .. ఏదీ అడగలేదు. పార్టీయే నన్ను గుర్తించింది. ఇప్పటివరకు పార్టీ ఆదేశాలను పాటిస్తూ వచ్చాను. 1980 నుంచి ఈరోజు వరకు పార్టీ సైనికుడిగా పనిచేశా. నాకు పార్టీకి మించి ఏదీ లేదు. పార్టీయే నా శ్వాస. పార్టీ కోసం.. పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను.
జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం.. అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా. వారితో చర్చించి తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ముందుకెళ్తాం. తెలంగాణలో భాజపా అధికారంలోకి తీసుకొచ్చే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం. ఇవాళ హైదరాబాద్లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశాం. జులై 8న ప్రధాని మోదీ వరంగల్ వస్తున్నారు. ఈ రెండు రోజులు వరంగల్ సభ ఏర్పాట్లపై చర్చించి.. సభను విజయవంతం చేస్తాం’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లో దక్షిణ భారత రాష్ట్రాల సమావేశం..
‘‘దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైన నాయకులతో కూడిన సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నాం. కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, లక్షద్వీప్ చెందిన నాయకులు సమావేశానికి హాజరవుతారు. దక్షిణ భారతదేశంలో భాజపా తీసుకోవాల్సిన చర్యలు, రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై భేటీలో చర్చిస్తాం. దక్షిణ భారత్లో భాజపాను మరింత పటిష్టం చేయాలి.. అందుకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలపై సమావేశంలో చర్చిస్తాం’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి