Kishan Reddy: ‘భారత్ బ్రాండ్‌’ పేరుతో ఎరువుల అమ్మకాలు: కిషన్‌రెడ్డి

రైతులకు కావాల్సిన అన్ని సేవలను ఒకే చోట కల్పించేందుకు ఎరువుల రిటైల్‌ షాపులను ప్రధానమంత్రి కిసాన్‌ సేవా కేంద్రాలుగా మారుస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated : 26 Jul 2023 14:58 IST

హైదరాబాద్‌: రైతులకు కావాల్సిన అన్ని సేవలను ఒకే చోట కల్పించేందుకు ఎరువుల రిటైల్‌ షాపులను ప్రధానమంత్రి కిసాన్‌ సేవా కేంద్రాలుగా మారుస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ‘భారత్‌ బ్రాండ్’ పేరుతో రేపటి నుంచి ఎరువుల అమ్మకాలు అమల్లోకి వస్తాయన్నారు. అక్కడ నాణ్యమైన ఎరువులు, విత్తనాలు నిర్దేశిత ధరలతో అందుబాటులో ఉంటాయని చెప్పారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

మొదటి దశలో రేపు లక్షా 25వేల షాపులను ప్రధాని ప్రారంభిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. భూసార పరీక్షలు, విత్తన పరీక్షలు ఈ కేంద్రాల్లో నిర్వహిస్తారన్నారు. వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు అక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. సల్ఫర్‌ కోటెడ్‌ యూరియాను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. 14వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను 8.5కోట్ల మంది రైతుల ఖాతాల్లో రేపు ప్రధాని జమ చేస్తారన్నారు. తెలంగాణలోని 39లక్షల మంది రైతుల ఖాతాలో కిసాన్ సమ్మాన్ డబ్బులు జమ అవుతాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని