Kishan Reddy: నేడు బాధ్యతల స్వీకరణ.. భాగ్యలక్ష్మి అమ్మవారికి కిషన్రెడ్డి ప్రత్యేక పూజలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబర్పేట చేరుకుని పూలే విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత బషీర్బాగ్లోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కిషన్రెడ్డి వెంట ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. కిషన్రెడ్డి ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని భాజపా కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.