Karnataka Elections: దేవేగౌడ కోడలికి చుక్కెదురు.. హాసన్లో జేడీఎస్ అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో Karnataka (Assembly Elections) హాసన్ నియోజవర్గంలో (Hassan Assembly) జేడీఎస్ (JDS) అభ్యర్థిత్వపై నెలకొన్న ఉంత్కఠకు తెర పడింది. శుక్రవారం పార్టీ రెండో విడుద అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో హాసన్ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది.
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka Assembly Elections)లో రాజకీయ పార్టీలు విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో హాసన్ (Hassan Assembly) నియోజకవర్గంలో జేడీఎస్ (JDS) అభ్యర్థి ఎవరనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఇక్కడి నుంచి దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవణ్ణ (HD Revanna) భార్య భవానీ రేవణ్ణ (Bhavani Revanna) పోటీ చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ( HD Kumaraswamy) మాత్రం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి హాసన్ టికెట్ కేటాయిస్తామని చెబుతూ వచ్చారు.
ఈ మేరకు పార్టీ శుక్రవారం రెండో విడత అభ్యర్థుల జాబితాను వెలువరించింది. ఇందులో హాసన్ స్థానానికి జేడీఎస్ అభ్యర్థిని పార్టీ ఖరారుచేసింది. మాజీ ఎమ్మెల్యే హెచ్ఎస్ ప్రకాశ్ కుమారుడు హెచ్పీ స్వరూప్ పోటీ చేస్తారని కుమారస్వామి ప్రకటించారు. జేడీఎస్ను కుటుంబ పార్టీ అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తిప్పి కొట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘ఈ ఉదయం భవానీ రేవణ్ణ నాతో మాట్లాడారు. హాసన్లో పోటీ చేసే అభ్యర్థిపై రేవణ్ణ, నేను చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాం. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు. రేవణ్ణ, భవానీ రేవణ్ణ మద్దతుతోనే హాసన్ అభ్యర్థిని నిర్ణయించాం’’ అని కుమారస్వామి చెప్పారు.
హాసన్ మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవే గౌడ (Deve Gowda) సొంత జిల్లా కావడంతో ఇక్కడి జేడీఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర చర్చ జరిగింది. ఈ జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఆరు స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికల్లో హాసన్ నిజయోక వర్గంలో భాజపా అభ్యర్థి పీతమ్ గౌడ విజయం సాధించారు. జేడీఎస్ రెండో విడత జాబితాలో గుండ్లుపేట స్థానం నుంచి కదబూర్ మంజునాథ్, యలహంక స్థానం నుంచి మునేగౌడ, శరవణనగర్లో ముస్తఫా, యశ్వంతపూర్ స్థానం నుంచి జావారే గౌడ, అరకలగూడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మంజు పోటీ చేస్తారని ప్రకటించింది. మొదటి విడత జాబితాలో 93 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?