Telangana News: మునుగోడులో గెలిస్తే ఏం చేస్తారో వారిద్దరూ చెప్పలేదు: మల్లు రవి
భాజపా, తెరాస బహిరంగ సభలు రెండూ రాజకీయాల చుట్టే తిరిగాయని.. సామాన్య ప్రజల సమస్యలపై ఒక్కరూ ప్రస్తావించలేదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
హైదరాబాద్: భాజపా, తెరాస బహిరంగ సభలు రెండూ రాజకీయాల చుట్టే తిరిగాయని.. సామాన్య ప్రజల సమస్యలపై ఒక్కరూ ప్రస్తావించలేదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. గాంధీ భవన్లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సెంటిమెంట్తో మళ్లీ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారన్నారు. మునుగోడులో గెలిస్తే ఏం చేస్తారని కేసీఆర్, అమిత్ షా చెప్పలేదని పేర్కొన్నారు. బహిరంగ సభల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొనేందుకే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. ఎన్నికల హామీల అమలు ప్రస్తావన ఎక్కడా రాలేదన్నారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదనే భాజపా, తెరాస పరస్పరం తిట్టుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడిన ప్రధాని మోదీ, అమిత్ షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మల్లు రవి ప్రశ్నించారు.
అక్రమాల్లో పోటీ పడుతున్నారు: పొన్నాల లక్ష్మయ్య
‘‘బహిరంగ సభలకు జనం వచ్చినంత మాత్రాన ఓట్లు రావు. కేసీఆర్ మునుగోడులో సెంటిమెంట్తో గెలవాలని చూస్తున్నారు. ఇన్ని రోజులు మునుగోడుకు చేసిందేమిటో సీఎం ఎందుకు చెప్పలేకపోతున్నారు? భాజపా, తెరాస నేతలు అక్రమాల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. దేశాన్ని మోదీ.. రాష్ట్రాన్ని కేసీఆర్.. అప్పుల కుప్పగా మార్చారు. అవినీతి, అక్రమాలు చేసిన వారు జైల్లో ఉండాల్సిన సమయం వచ్చింది. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన కాంగ్రెస్కు వచ్చే నష్టం ఏమీ లేదు’’ అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..