Botsa: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడారు.
విజయవాడ: తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడారు.‘‘ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి’’ అని బొత్స వ్యాఖ్యానించారు.
ఆ వ్యవస్థ ఎలా పుట్టిందో పవన్ తెలుసుకోవాలి
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. అతని వ్యాఖ్యలపై ఎవరూ పట్టించుకోకుంటేనే మంచిదన్నారు. పొద్దు పొద్దున్నే మాకెందుకీ రచ్చ?అంటూ అసహనం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందో ముందు పవన్ తెలుసుకోవాలని బొత్స హితవుపలికారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థపై దుర్బుద్ధితో విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.