Telangana news: భాజపాకు ఓటు వేసి మోసపోవద్దు.. గోస పడొద్దు: హరీశ్రావు
ఎన్నికల తేదీ దగ్గర పడగానే బండి సంజయ్, రఘునందన్, ఈటల రాజేందర్ ఆరోగ్యం బాగోలేదన్నారని... ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అలానే చేస్తారని తెలంగాణ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణలో ఎకరం అమ్మితే కర్ణాటకలో వంద ఎకరాల భూమి వస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్లో మర్రిగూడ గ్రామ ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజా ఆత్మగౌరవం, రాజగోపాల్రెడ్డి ధనదాహం మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. అభివృద్ధిని కాంక్షించే తెరాసకే పట్టం కట్టాలని హరీశ్రావు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల తేదీ దగ్గర పడగానే బండి సంజయ్, రఘునందన్, ఈటల రాజేందర్ ఆరోగ్యం బాగోలేదన్నారని... ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అలానే చేస్తారని హరీశ్రావు విమర్శించారు. అసలు భాజపా రాజకీయం అలాగే ఉంటుందని... చెయ్యి విరిగిందని ఒకరు, కాలు విరిగిందని మరొకరు, పాపం అనేలా చేసుకుంటారన్నారు. ఇలాంటి జిమ్మిక్కులు నమ్మి మోసపోవద్దని సూచించారు. మునుగోడు నుంచి వలస వచ్చిన వారు సొంత ఊరుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. శివన్నగూడెం చెరువులో నీళ్లు పోయించి ఆ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామన్న హరీశ్ రావు... తెలంగాణ పథకాల వల్ల భూమి విలువ ఎంతో పెరిగిందన్నారు. మర్రిగూడ దిక్కు మళ్లి చూడని రాజగోపాల్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. భాజపాకు ఓటు వేసి మోస పోవద్దు... గోస పడొద్దు అని హరీశ్రావు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ