TS Assembly: దేశం చూపు కేసీఆర్ వైపు.. సంక్షేమంలో మాకు తిరుగులేదు: కేటీఆర్
కేసీఆర్ అధికారంలోకి రాకముందు విద్యుత్ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రసంగానికి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్: దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిగా ఉందని చెప్పారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన విమర్శలపై కేటీఆర్ స్పందించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడిన మాటలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని కేటీఆర్ విమర్శించారు. రఘునందన్ రావు న్యాయవాది.. న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున ఆయన భారాసకు ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు.
‘‘దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ఎదిగింది. రాష్ట్రంలో కరెంట్ కష్టం లేదు.. తాగునీటి తిప్పలు లేవు. సంక్షేమంలో ప్రభుత్వానికి తిరుగులేదు. దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు ఉంది. తెలంగాణతో కేసీఆర్కు ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరు. మా ప్రభుత్వం కుటుంబపాలనే.. 4 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు మా కుటుంబమే. రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది. నియామకాల కల సాకారం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యుత్తమ 20గ్రామ పంచాయతీల్లో.. తొమ్మిది తెలంగాణలోనే ఉన్నాయి. పల్లెపల్లెకు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. దేశంలోని వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. 2022లో 65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 65లక్షల మంది రైతు ఖాతాల్లో ₹65వేల కోట్లు జమ చేశాం. ఐక్యరాజ్యసమితి కూడా రైతు బంధు పథకాన్ని ప్రశంసించింది. భాజపా తెచ్చిన నల్ల చట్టాల ద్వారా 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అసలు మోటార్లకు మీటర్లు ఎందుకు?’’
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం..
కేసీఆర్ అధికారంలోకి రాకముందు విద్యుత్ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలి. అక్కడ గుజరాత్లోని పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇస్తున్నారు. ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు 6మీటర్ల మేర పెరిగాయి. సాగునీటి రంగంలో తెలంగాణ గొప్ప విజయాలు సాధించింది. మాంసం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. జాతీయ తలసరి సగటు మాంసం వినియోగం దేశంలో 5 కేజీలు ఉంటే తెలంగాణలో 21 కేజీలు ఉంది. అంగన్వాడీ ఉద్యోగులకు అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉంది’’ అని కేటీఆర్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!