Ap Politics : వైకాపా నేతల మాట వినాల్సిందే : మంత్రి అప్పలరాజు

తెదేపా సర్పంచ్‌లంతా వైకాపా నేతల మాట వినాల్సిందేనని, లేకపోతే వారి ప్రతిపాదనలు ఎపీడీవో కార్యాలయంలోనే ఆగిపోతాయని మంత్రి అప్పలరాజు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో...

Published : 25 Jan 2022 17:57 IST

పలాస : తెదేపా సర్పంచ్‌లంతా వైకాపా నేతల మాట వినాల్సిందేనని, లేకపోతే వారి ప్రతిపాదనలు ఎపీడీవో కార్యాలయంలోనే ఆగిపోతాయని మంత్రి అప్పలరాజు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధులందరూ అన్ని రకాల పనుల ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అన్ని పంచాయతీలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దే బాధ్యతను  ఎంపీపీలు తీసుకోవాలని
సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని