Ts News: మోదీకి భయపడే పరిస్థితిలో తెలంగాణ లేదు: తలసాని

రాష్ట్రాల దయాదాక్షిణ్యంపైనే కేంద్ర ప్రభుత్వం బతుకుతోందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో తలసాని మీడియాతో

Published : 15 Feb 2022 01:53 IST

హైదరాబాద్‌: రాష్ట్రాల దయాదాక్షిణ్యంపైనే కేంద్ర ప్రభుత్వం బతుకుతోందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో తలసాని మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు తెరాస ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. పాకిస్థాన్‌, మతం పేరుతో రెచ్చగొట్టడమే భాజపాకు తెలుసునని వ్యాఖ్యలు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలో కూడా భాజపా గల్లంతయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధాని మోదీకి భయపడే పరిస్థితిలో తెలంగాణ లేదని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తల కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏమైనా తెచ్చారా? అని నిలదీశారు. కేంద్రానికి తెలంగాణ ఏమిచ్చిందో లెక్క చెబుతామని.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో కిషన్‌ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. భాజపా, తెరాస కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని తలసాని సవాల్‌ విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని