MK Stalin: ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే నేతపై సీఎం స్టాలిన్ వేటు
తమిళనాడు గవర్నర్, భాజపా నాయకురాలు ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిపై ఆ పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకుంది. అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు.
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, భాజపా నాయకురాలు ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే పార్టీ నేత శివాజీ కృష్ణమూర్తిపై ఆ పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి నెలలోనూ శివాజీ తమిళనాడు గవర్నర్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అప్పట్లో డీఎంకే ప్రకటించింది. అయినప్పటికీ, ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తాజాగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఖుష్బూను ఉద్దేశిస్తూ శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేగింది. ఈ వీడియోను ఆమె ట్విటర్లో పోస్టు చేస్తూ.. సీఎం స్టాలిన్ను ట్యాగ్ చేశారు. శివాజీ తన పట్ల చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని పేర్కొన్నారు. అవే కామెంట్స్ను మీ కుటుంబంలోని మహిళలకు అంటే మీరు ఊరుకుంటారా? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీకు అర్థం కానిది ఏంటంటే.. ఆయన కేవలం నన్నే కించపరచడం లేదు. మిమ్మల్ని, మీ తండ్రిగారి లాంటి గొప్ప నేతల్ని సైతం అవమానపరుస్తున్నారు. మీరు ఆయనకు ఎంత ఎక్కువ చనువు ఇస్తే.. మీరు రాజకీయంగా అంత వెనకబడిపోతారు. మీ పార్టీ అనైతిక వ్యక్తులకు స్వర్గధామంలా మారుతోంది. ఇది సిగ్గు చేటు’’ అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు. శివాజీ కృష్ణమూర్తి చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య