Prez polls: రాష్ట్రపతి ఎన్నికలు.. రంగంలోకి నడ్డా, రాజ్నాథ్ సింగ్!
Prez polls: అధికార భాజపా కదన రంగంలోకి దూకుతోంది. అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా సంప్రదింపులు జరపనుంది.
దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు (Prez polls) నగారా మోగిన వేళ తమ బలం చాటుకునేందుకు పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నడుం బిగించారు. వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఈ క్రమంలో అధికార భాజపా సైతం కదన రంగంలోకి దూకుతోంది. అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా సంప్రదింపులు జరపనుంది. ఇందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ సిద్ధమ్యారు. ఎన్టీయే భాగస్వామ్య పక్షాలు సహా ప్రతిపక్ష పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్థులను వీరు కలవనున్నారు. త్వరలోనే వీరి సంప్రదింపులు ప్రారంభం కానున్నాయని భాజపా ఓ ప్రకటనలో తెలిపింది.
2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా రామ్నాథ్ కోవింద్ను బరిలోకి దింపగా.. విపక్షాలు మీరా కుమార్ను తమ అభ్యర్థిగా నిలిపాయి. ఆ ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత ఆ పార్టీ తమను సంప్రదించిందని భాజపాపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో భాజపా ముందుగానే కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికైతే అటు అధికార పార్టీగానీ, ఇటు ప్రతిపక్షాలు గానీ అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. జులై 18న ఎన్నికలు జరగనున్నాయి.
పవార్తో ఆప్ ఎంపీ భేటీ
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను ఆప్ ఎంపీ సంజయ్సింగ్‘ కలిశారు. త్వరలో జరగోయే రాష్ట్రపతి ఎన్నికల విషయమై వీరిద్దరూ చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో దిల్లీలో భాజపాను ఓడించేందుకు ఆప్, కాంగ్రెస్ ఓ అవగాహనకు రావాలని పవార్ సూచించారు. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ భేటీలో ఏం చర్చించారన్నది బయటకు రాలేదు. మహారాష్ట్రలో ఎన్సీపీ భాగస్వామిగా ఉన్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు