Rahul Gandhi: ‘ మీ కాన్ఫిడెన్స్ నెక్ట్స్ లెవల్’.. రాహుల్ గాంధీకి భాజపా ఎమ్మెల్యే ప్రశంసలు!
బ్రిటన్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) దిగిన ఫొటోను ప్రశంసిస్తూ భాజపా (BJP) నాయకుడు చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో(Social Media) వైరల్గా మారాయి.
దిల్లీ: గత కొద్దిరోజులుగా బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi).. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు.. భాజపా (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో రాహల్ గాంధీ ఫొటోను భాజపా నాయకుడు ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆయనెవరో కాదు.. ఆసక్తికరమైన పోస్ట్లతో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే నాగాలాండ్ భాజపా అధ్యక్షుడుతెమ్జెన్ ఇమ్నా అలోంగ్ (Temjen Imna Along).
తాజాగా రాహుల్ గాంధీ లండన్ పర్యటనలో భాగంగా సూట్ ధరించి దిగిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ..‘‘మీరు ఒంటరిగా ఉన్నారని తెలిసినా.. మీరు నమ్మిన దాని కోసం నిలబడండి’’ అని క్యాప్షన్ను జత చేసింది. దీనిపై తెమ్జెన్ స్పందిస్తూ ‘‘ఒప్పుకోవాలి. ఫొటో బాగా వచ్చింది. కాన్ఫిడెన్స్, ఫోజ్ నెక్ట్స్ లెవల్’’ అంటూ కామెంట్ చేశారు. మరో ట్వీట్లో రాహుల్ గాంధీ ఫొటో, క్యాప్షన్ను షేర్ చేస్తూ.. ‘‘కనీసం క్యాప్షన్ అన్నా మీరు రాయండి’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో రాహుల్ ఫొటోకు ట్యాగ్ చేసిన క్యాప్షన్ గూగుల్ నుంచి కాపీ చేశారని ఎద్దేవా చేస్తూ తెమ్జెన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెమ్జెన్ చేసిన ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్గా మారాయి. మరోవైపు రాహుల్ ఫొటో చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను కాబోయే పీఎం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
బ్రిటన్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దాన్ని గుర్తించడంలో అమెరికా, యూరఫ్ సైతం విఫలమయ్యాయంటూ ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. దాంతోపాటు ఆరెస్సెస్ను ఫాసిస్ట్ సంస్థగా అభివర్ణించారు. రాహుల్ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. ‘‘ప్రమాదంలో ఉన్నది, ప్రజాస్వామ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ. విదేశీ గడ్డపై భారత్ గురించి ఇలాంటి వ్యాఖ్యాలు చేడం సరికాదు’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..