Nara Lokesh: వైకాపా నేత‌ల అవినీతికి ఉద్యోగులెందుకు బ‌లి కావాలి?: నారా లోకేశ్‌

జ‌గ‌న్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Published : 03 Feb 2024 14:30 IST

అమరావతి: జ‌గ‌న్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ధ్వజమెత్తారు. వైకాపా పాల‌న‌ని అంత‌మొందిచేందుకు ఉద్యోగులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని కోరారు. విశాఖ‌ జిల్లాలో భూ అక్రమాల‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని వైకాపా నేత‌లే త‌హ‌సీల్దార్ రమణయ్యను అత్యంత‌ దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, వేధింపుల‌తో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవ‌డం విచార‌క‌ర‌మన్నారు. 

అధికారం కోసం సొంత బాబాయ్‌ని హత్య చేసిన జ‌గ‌న్ గ్యాంగ్ త‌మ దోపిడీకి స‌హ‌క‌రించ‌ని ఉద్యోగుల అడ్డు తొల‌గించుకుంటోందని ఆరోపించారు. వైకాపా నేత‌ల అవినీతికి వారెందుకు బ‌లి కావాలని ప్రశ్నించారు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో వంద‌ల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారన్న ఆయన.. ఈ వారంలోనే ముగ్గురు బ‌ల‌య్యారని చెప్పారు. ఈ ఫ్యాక్షన్ స‌ర్కారు అంతానికి ఇంకా 2 నెల‌లే స‌మ‌యం ఉందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షిస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని