AP News: ధూళిపాళ్ల చేసిన తప్పేంటి?: లోకేశ్
సంగం డెయిరీ కేసులో బెయిల్పై విడుదలైన ఆ సంస్థ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు.
విజయవాడ: సంగం డెయిరీ వ్యవహారంలో ఆ సంస్థ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటో వైకాపా ప్రభుత్వం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. పాడి రైతులకు లీటరుకు రూ.4 ఎక్కువ ఇవ్వడం.. ఆస్పత్రి ఏర్పాటు చేసి రైతులకు 50 శాతం రాయితీతో వైద్యం అందించడం ఆయన చెసిన తప్పా? అని నిలదీశారు. సంగం డెయిరీ కేసులో బెయిల్పై విడుదలైన ధూళిపాళ్ల నరేంద్రను నారా లోకేశ్ పరామర్శించారు. విజయవాడలోని ధూళిపాళ్ల ఇంటికి వెళ్లి ఆయనతో ఏకాంతంగా కాసేపు సమావేశమయ్యారు. ఆ తర్వాత కుటుంబసభ్యులను లోకేశ్ పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘ రైతుల కోసం నిరంతం పోరాడిన వ్యక్తి నరేంద్ర. ప్రజల తరఫున పోరాడుతున్న తెదేపా నేతలను ఇబ్బంది పెడుతున్నారు. ఏపీలోని పాడిపరిశ్రమను గుజరాత్కు అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఒంగోలు డెయిరీని ఇప్పటికే అమూల్కు అప్పగించారు. అమూల్ డెయిరీ కోసం రూ.3వేల కోట్లు రుణం తీసుకున్నారు. ప్రజల సొమ్ముతో సోకులు చేస్తున్నారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడుతుంటే అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే సీఎం జగన్ సరిగా సమీక్ష కూడా జరపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించారు. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, కూన రవికుమార్, అశోక్ గజపతిరాజు, చింతమనేని ప్రభాకర్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, సోమిరెడ్డి, భూమా అఖిలప్రియ, బీసీ జనార్దన్రెడ్డి.. ఇలా అందరిపైనా అక్రమకేసులు పెట్టారు’’ అని లోకేశ్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?