Nara Lokesh: ఆడబిడ్డలకు రక్షణంటే నిందితులను కాపాడటమేనా?: నారా లోకేశ్‌

ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే గన్‌ కంటే ముందొస్తానని రూ.కోట్లతో ప్రచారం చేయించుకున్న సీఎం జగన్‌..

Updated : 12 May 2022 11:44 IST

అమరావతి: ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే గన్‌ కంటే ముందొస్తానని రూ.కోట్లతో ప్రచారం చేయించుకున్న సీఎం జగన్‌.. ఆయన సొంత జిల్లా ప్రొద్దుటూరులో దళిత బాలికపై అత్యాచారం జరిగితే ఎక్కడా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ఏదా గన్‌? ఎక్కడా జగన్‌? అని నిలదీశారు.

అమాయక బాలికపై లైంగిక దాడిని మహిళా పోలీసులు వెలుగులోకి తెస్తే నిందితులను పట్టించుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప‌దిహేనేళ్లు కూడా నిండ‌ని బాలికను గ‌ర్భవ‌తిని చేసిన నిందితుల‌ను కాపాడటమేనా.. మీరు ఆడబిడ్డలకు కల్పించే రక్షణ? అని లోకేశ్‌ ట్వీట్‌లో ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని