Ajit Pawar:ఆ పదవికి సుప్రియ పేరును సూచించిందే నేను: అజిత్ పవార్
ఎన్సీపీ (ncp) అంతర్గత నియామకాలపై ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) అసంతృప్తిగా ఉన్నారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. పార్టీ నిర్ణయంతో తాను సంతోషంగానే ఉన్నట్లు చెప్పారు.
దిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ncp) కార్యనిర్వాహక అధ్యక్షులుగా సుప్రియా సూలే (Supriya Sule), ప్రఫుల్ పటేల్ (Praful Patel) నియమితులైన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో ఈ నియామకాలపై అజిత్ పవార్ అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. పలు విపక్ష పార్టీలు ఎన్సీపీలో అజిత్కు ప్రాధాన్యత లేదని భావిస్తున్నాయి. తాజాగా వీటిపై అజిత్ స్పందించారు. పార్టీ నిర్ణయంతో తాను సంతోషంగానే ఉన్నానని, కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి సుప్రియా సూలే పేరును సూచించిందే తానని తెలిపారు.
మీడియాతో అజిత్ మాట్లాడుతూ.. ‘‘దిల్లీలో పదవుల ప్రకటన అనంతరం నేను మీడియాతో మాట్లాడదామనుకున్నా. కానీ, అత్యవసరంగా పుణె వెళ్లాల్సి వచ్చింది. అందుకే స్పందించడం ఆలస్యమైంది. పార్టీ నిర్ణయంపై నేను సంతోషంగానే ఉన్నా. కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి సుప్రియ పేరును సూచించిందే నేను. ఇప్పటికే పార్టీ నాకో బాధ్యత(అసెంబ్లీలో ప్రతిపక్ష నేత) అప్పగించింది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ.. రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టాను. ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం. ఇతరులు వీటికి దూరంగా ఉంటే మంచిది’’అని అన్నారు.
ఎన్సీపీ పార్టీ 24వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకంపై ప్రకటన చేశారు. ఈ విషయంలో అజిత్ అసంతృప్తిగా ఏమీ లేరని స్పష్టం చేశారు. పార్టీ ఏకాభిప్రాయంతోనే ప్రఫుల్, సుప్రియలకు బాధ్యతలను అప్పగించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు