Nitish Kumar: ‘నాకు ఆ ఆలోచన లేదు’: చేతులు జోడించి మరీ స్పష్టం చేసిన నీతీశ్
భాజపాతో బంధాన్ని తెంచుకొని ఆర్జేడీతో దోస్తీ కట్టిన బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు.
పట్నా: భాజపాతో బంధాన్ని తెంచుకొని ఆర్జేడీతో దోస్తీ కట్టిన బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు. ఈ సమయంలో ఆయన ప్రధాని పదవికి పోటీపడతారా..? అనే వార్తలు వినిపిస్తున్నాయి. దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వాటిపై మరోసారి స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుతానికి తన మనసులో ప్రధానమంత్రి పదవి గురించి ఎలాంటి ఆలోచన లేదన్నారు. ‘అది నా మనసులో లేదు. నాకు సన్నిహితంగా మెలిగేవారితో సహా ఎవరు ఏం చెప్పినా నాకు సంబంధం లేదు’ అని చేతులు జోడించి మరీ స్పష్టం చేశారు. తాను ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తానని, అంతా కలిసి పనిచేస్తే బాగుంటుందన్నారు. ‘నేను అందరిని ఏకం చేయాలని అనుకుంటున్నాను. ఆ దిశగా సానుకూలంగా వెళ్తున్నాను. దీనికి సంబంధించి నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి’ అని వెల్లడించారు. బిహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో నీతీశ్ చేసిన వ్యాఖ్యలే.. ఆయన ప్రధాని పదవికి పోటీ పడతారనే చర్చకు దారితీశాయి. అప్పుడు మాట్లాడుతూ.. 2024 లోక్సభ ఎన్నికల గురించి భాజపా ఆందోళన చెందుతోందన్నారు. ‘2014లో ఆయన గెలిచారు.. కానీ 2024లో ఆ గెలుపు సాధ్యమవుతుందా..?’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు.
2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్ పార్టీ జేడీ(యూ), భాజపా కూటమిగా పోటీ చేసి విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన రాజకీయ మనుగడకు కాషాయం పార్టీ నుంచి ముప్పు పొంచి ఉందని భావించి.. దానికి గుడ్బై చెప్పారు. ఆర్జేడీతో కొత్త పొత్తు కుదుర్చుకొని మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!