Telangana News: తెలంగాణను అల్లకల్లోలం చేసేందుకు షర్మిల కుట్ర: ఎమ్మెల్సీ పల్లా
వైతెపా అధ్యక్షురాలు షర్మిలకు వైఎస్సార్ బిడ్డ అని చెప్పుకొనే అర్హత లేదని తెరాస ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ అన్నారు. వైఎస్ఆర్ జీవితాంతం భాజపా, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పోరాడారని.. అదే భాజపా, ఆర్ఎస్ఎస్తో షర్మిల చేతులు కలిపి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
హైదరాబాద్: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భాజపాతో ఒప్పందం చేసుకొని.. మోదీకి ఏజెంట్గా పనిచేస్తున్నారని తెరాస ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఆరోపించారు. తెలంగాణను అల్లకల్లోలం చేసేందుకు షర్మిల కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... షర్మిల పాదయాత్రకు భాజపా ప్రజలను సమీకరిస్తోందని ఆరోపించారు.
నర్సంపేట ఘటనను షర్మిల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. షర్మిలకు వైఎస్సార్ బిడ్డ అని చెప్పుకొనే అర్హత లేదన్నారు. వైఎస్ఆర్ జీవితాంతం భాజపా, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పోరాడారని.. అదే భాజపా, ఆర్ఎస్ఎస్తో షర్మిల చేతులు కలిపి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనపై ఆమె అడ్డగోలు విమర్శలు చేస్తున్నారన్నారు. మైనార్టీలు కేసీఆర్ పాలనలో సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఎజెండా దేశమంతా అమలు కావాలంటే బీఆర్ఎస్ రావాలని పల్లా అన్నారు. తెలంగాణలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలని షర్మిల ప్రయత్నించడం సరికాదని స్టీఫెన్సన్ అన్నారు. తెలంగాణలో శాంతి ఉన్నందునే అభివృద్ది జరుగుతుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్