మోసపూరిత వైఖరితో ఎంతో మందిని జగన్ పొట్టన పెట్టుకున్నారు: పరిటాల సునీత
ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలతో పోరాడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ను మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు.
అనంతపురం: ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలతో పోరాడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ను మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.
తొలుత పరిటాల సునీత మాట్లాడుతూ.. మోసపూరిత వైఖరితో అనేకమంది ఉద్యోగ, ఉపాధ్యాయులను సీఎం జగన్ పొట్టపెట్టుకున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాద్యాయులకు సక్రమంగా వేతనాలు ఇవ్వలేకపోతోందని విమర్శించారు. చదువు చెప్పాల్సిన టీచర్లను పాఠశాలలో మూత్ర శాలల పరిశీలన విధులు కేటాయిస్తున్నారని ఆక్షేపించారు. టీచర్లను కించపరుస్తున్నారని.. సీపీఎస్ రద్దు హామీని నెరవేర్చలేదని మల్లేశ్ ఆత్మహత్యకు యత్నించారన్నారు.
పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. జగన్ తన మోసపూరిత హామీలతో ఉపాధ్యాయులను తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు. తమ హక్కుల సాధనకు ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నా.. జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీచర్లు ఉద్యమించి ప్రభుత్వం మెడలు వంచాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్