Pawan Kalyan: పాపం పసివాడు ‘క్లాస్వార్’ గురించి తెలుసుకోవాలి: పవన్
ముఖ్యమంత్రి జగన్ విపక్షాలను ఉద్దేశించి చేసిన ‘క్లాస్ వార్’ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాల పర్వం కొనసాగించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ విపక్షాలను ఉద్దేశించి చేసిన ‘క్లాస్ వార్’ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాల పర్వం కొనసాగించారు. పాపం పసివాడు పేరుతో బుధవారం ఓ కార్టూన్ పోస్టు చేసిన పవన్.. ఇవాళ కథాకళి పేరుతో ఓ వీడియోను ట్వీట్ చేశారు. అందులో సీఎం జగన్ క్లాస్ వార్ గురించి చేసిన వ్యాఖ్యలు.. వాటికి స్పందనగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, అధికార ప్రతినిధి వేములపాటి అజయ్కుమార్ మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఆరు చోట్ల ప్యాలెస్లు నిర్మించుకున్న జగన్.. పేదల పక్షపాతిని అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని నాగబాబు, అజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. బహుశా జగన్ క్యాష్ వార్ గురించి మాట్లాడి ఉంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ ట్వీట్ వీడియోకు.. పాపం పసివాడు క్లాస్వార్ గురించి తెలుసుకోవాలన్న వ్యాఖ్యను పవన్ జోడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్