Pawan Kalyan: బుగ్గలు నిమిరే వారిని కాదు.. మాటపై నిలబడే వారిని నమ్మండి: పవన్
రాజకీయాల్లో విలువలు నిలబెట్టేలా తాను మాట్లాడుతుంటే వైకాపా నేతలు దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏలూరు: రాజకీయాల్లో విలువలు నిలబెట్టేలా తాను మాట్లాడుతుంటే వైకాపా నేతలు దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా దూషిస్తూ .. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను కానీ.. ఇప్పటి నుంచి సీఎంను ఏకవచనంతో పిలుస్తానని ప్రకటించారు. వారాహి విజయయాత్ర రెండో విడత ఏలూరు నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వ లోపాలను కాగ్ నివేదిక వెల్లడించింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులను ఎక్కడ ఖర్చు చేశారు? రాష్ట్ర బడ్జెట్లో పదోవంతు అప్పులు తెచ్చారు. చేసిన అప్పులకు జగన్, మంత్రివర్గం జవాబు చెప్పాల్సిందే. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి చాలా కీలకం. విద్య, వైద్యం, ఉపాధి కల్పించే వరకు ప్రజలకు అండగా ఉంటాం. కొల్లేరు కలుషితమవుతోంది.. సంరక్షించే బాధ్యత మాది. 115 ఏళ్లనాటి కృష్ణా జ్యూట్మిల్లు మూసేస్తే ఎవరూ మాట్లాడలేదు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరుగుతోంది. మానవ అక్రమ రవాణాకు కారణం.. వైకాపా వాలంటీరు వ్యవస్థ. ఇందులో వైకాపా నేతల పాత్ర ఉందని నిఘా వర్గాలే చెప్పాయి. యువతుల అదృశ్యంపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష చేయలేదు. మద్య పాన నిషేధం అన్నారు.. అమలు చేశారా?. సీఎం సహా ఒక్కో ఎమ్మెల్యే రూ.వందల కోట్లు దోచేస్తున్నారు. ఏలూరులో వరద వస్తే రక్షణ గోడలు లేవు. హలో ఏపీ.. బైబై వైసీపీ ఇదే మా నినాదం. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదు. పదవి నుంచి దిగిపోగానే జగన్ను వాడవాడలా వెంటాడతాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రభుత్వం మారాలి. బుగ్గలు నిమిరే వారిని కాదు.. మాటపై నిలబడే వారిని నమ్మండి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం