Ajit Pawar: పవార్ సాహెబ్.. రాజీనామా వెనక్కి తీసుకోరు..!
ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవార్(Sharad Pawar)రాజీనామాపై ఆయన సమీప బంధువు అజిత్ పవార్ స్పందించారు. పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరు వచ్చినా, పవార్ మార్గదర్శకత్వంలో పనిచేస్తారన్నారు.
ముంబయి: ఎన్సీపీ(NCP) పార్టీ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్(Sharad Pawar) వైదొలగడాన్ని పార్టీ వర్గాలు తట్టుకోలేకపోతున్నాయి. ఆయన వెంటనే రాజీనామా వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే జయంత్ పాటిల్ వంటి నేతలు కన్నీటి పర్యంతమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పవార్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగిన ఆడిటోరియం నుంచి కొందరు బయటకు వెళ్లి, ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ పరిణామాలపై ఆ పార్టీ నేత అజిత్ పవార్(Ajit Pawar) స్పందించారు.
‘ఎన్సీపీ కుటుంబానికి ఎప్పుడూ పవార్ సాహెబ్ అధినేతగా ఉంటారు. పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు వచ్చినా.. పవార్ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తారు. పార్టీ నాయకత్వంలో మార్పు ఆవశ్యకత గురించి కొద్దిరోజుల క్రితమే ఆయన చెప్పారు. వయస్సు, ఆరోగ్యరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని మనం గమనించాలి. సమయానుగుణంగా ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు సాహెబ్ చేసిందీ అదే. దానిని ఆయన వెనక్కి తీసుకోరు. ఒక అన్నగా ప్రస్తుత పరిణామంపై ఏమీ మాట్లాడొద్దని సుప్రియా సూలేకు సూచిస్తున్నాను’ అని అజిత్ అన్నారు. మరోపక్క రాజీనామాపై ఆమె శరద్ పవార్తో మాట్లాడాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.
ఆవేదనలో ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లోనే ఉంటాను. అయితే ఎన్నికల్లో పోటీ చేయను. మనమంతా కలిసి పనిచేద్దాం. నా రాజీనామాను ఆమోదించండి’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM