Ponnam Prabhakar: బలహీనవర్గాలకు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా?: మంత్రి పొన్నం

భారాస పాలనలో బడుగు, బలహీన వర్గాలకు ఏం న్యాయం చేశారో కేటీఆర్‌ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 30 Mar 2024 16:20 IST

హైదరాబాద్‌: భారాస పాలనలో బడుగు, బలహీన వర్గాలకు ఏం న్యాయం చేశారో కేటీఆర్‌ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా మీరే అన్ని ముఖ్యమైన పదవులు చేపట్టి.. ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక కులగణన చేపట్టామన్నారు. భారాస పాలనలో జరిగిన మోసాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని