AP BJP : భాజపా నూతన కార్యవర్గం ఎన్నిక.. ప్రకటించిన పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్‌ భాజపా నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. మొత్తం 26 మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

Published : 18 Aug 2023 22:27 IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ భాజపా నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. మొత్తం 26 మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శులుగా కాశీ విశ్వనాథరాజు, బిట్ర శివన్నారాయణ, దయాకర్‌రెడ్డి, తపనా చౌదరి పేర్లను ఎంపిక చేశారు. మాధవ్‌, విష్ణువర్దన్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్‌రాజుతో పాటు మరో 11 మంది భాజపా ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. కాగా, భాజపా కార్యదర్శులుగా మరో పది మందికి అవకాశం దక్కింది. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కమిటీ, పలు మోర్చాల అధ్యక్షుల పేర్లను సైతం పురందేశ్వరి వెల్లడించారు. భాజపా అధికార ప్రతినిధులుగా ఏడుగురికి అవకాశం కల్పించారు.

మోర్చాల నూతన అధ్యక్షులు వీరే..

  • భాజపా యువ మోర్చా అధ్యక్షుడు- మిట్టా వంశీ
  • భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు- నిర్మలా కిశోర్‌
  • భాజపా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు- కుమారస్వామి
  • భాజపా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు- గుడిసె దేవానంద్‌
  • భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు- గోపీ శ్రీనివాస్‌,
  • భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు- ఉమా మహేశ్వరరావు
  • భాజపా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు- షేక్‌ బాజీ
  • భాజపా మీడియా ఇన్‌ఛార్జి-పాతూరి నాగభూషణం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు