Assam CM: రాహుల్ గాంధీ.. మీరు సద్దాం హుస్సేన్లా మారిపోతున్నారు..!
భారత్ జోడో యాత్ర పేరుతో పలు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్ మాదిరిగా మారిపోతున్నారని భాజపా నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
అహ్మదాబాద్: ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేస్తోన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ మాదిరిగా కనిపిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. సర్దార్ పటేల్, జవహార్లాల్ నెహ్రూ లేదా మహాత్మా గాంధీ మాదిరిగా తయారైతే బాగుండేదని వ్యాఖ్యానించారు. సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్.. భాజపా నేతలు అల్పబుద్ధితో ప్రచారానికి దిగుతున్నారని విమర్శించింది.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్ సభలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రాహుల్ గురించి ప్రస్తావించారు. ‘ఇటీవల రాహుల్ గాంధీ రూపురేఖలు మారిపోయాయి. అయితే, ఇందులో ఎటువంటి తప్పులేదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఒకవేళ రూపురేఖలు మార్చుకోవాలంటే కనీసం సర్దార్ పటేల్ మాదిరిగానో లేదా జవహార్లాల్ నెహ్రూ లాగా మార్చుకుంటే ఉత్తమం. గాంధీజీ మాదిరిగా ఉంటే ఇంకా మంచిది. కానీ, సద్దాం హుస్సేన్ లాగా ఎందుకు మార్చుకుంటున్నారు..? ఎందుకంటే.. కాంగ్రెస్ సంప్రదాయం అనేది భారత ప్రజలకు తగినట్లుగా ఉండదు. భారత్ను ఎన్నడూ అర్థం చేసుకోని వారికి దగ్గరగా ఉంటుంది’ అని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు.
‘భారత్ జోడో యాత్రలో భాగంగా ఇటీవల ఎన్నికలు జరిగిన హిమాచల్ ప్రదేశ్తోపాటు ఎన్నికలు జరుగుతోన్న గుజరాత్లో పర్యటించేందుకు రాహుల్ గాంధీ సుముఖత చూపలేదు. ఎన్నికలు లేని రాష్ట్రాలపైనే ఆయన దృష్టి సారించారు. ఎందుకంటే ఆయన ఎక్కడ పర్యటిస్తే అక్కడ ఓటమి తప్పదని ఆయనకు తెలుసు’ అని విమర్శించారు. ఇక నర్మదా బచావో ఉద్యమం చేపట్టిన మేధా పాట్కర్ వంటి నాయకులతో రాహుల్ గాంధీ కలిసి నడవడాన్ని చూశానని.. అటువంటి వారు గుజరాత్ అభివృద్ధిని ఎన్నడూ కోరుకోరని అన్నారు.
అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ స్పందించారు. ‘ఇటువంటి తీవ్ర దూషణలపై స్పందించడం నాకు ఇష్టం లేదు. బహిరంగంగా మాట్లాడేటప్పుడు భాషను సరిగ్గా ఉపయోగించడం ఎంతో ముఖ్యం. అస్సాం ముఖ్యమంత్రి మాత్రం ఇటువంటి అల్పబుద్ధి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’ అని మనీశ్ తివారీ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ