Lokesh: లోకేశ్‌తో సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే భేటీ

తిరుపతి జిల్లా సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు.

Updated : 30 Jan 2024 20:25 IST

హైదరాబాద్‌: తిరుపతి జిల్లా సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మంగళవారం ఆయన కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో లోకేశ్‌తో సమావేశమయ్యారు. పార్టీ మారే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే .. లోకేశ్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని