Maharashtra: ‘అధికారం కోసం ఎన్నటికీ మోసం చేయను’.. చర్చనీయాంశంగా షిండే ట్వీట్
మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన అనుచరగణం అజ్ఞాతంలోకి వెళ్లడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ట్విటర్ బయోలో శివసేన పేరు తొలగింపు
ముంబయి: మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన అనుచరగణం అజ్ఞాతంలోకి వెళ్లడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో షిండే ట్విటర్ వేదిక చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘మేం బాలాసాహెబ్కు చెందిన బలమైన సైనికులం. ఆయన మాకు హిందుత్వను నేర్పించారు. బాలాసాహేబ్, ఆనంద్ దిఘే బోధనలను పాటిస్తోన్న మేం అధికారం కోసం ఎన్నటికీ మోసానికి పాల్పడం’ అంటూ షిండే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన గంట సేపటికే ట్విటర్ బయోలో షిండే ‘శివసేన’ అనే పదాన్ని తొలగించడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి సొంత ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరవేసేందుకు సిద్ధమైన షిండేపై శివసేన వేటు వేసింది. రాష్ట్ర అసెంబ్లీ పార్టీ శాసనసభా పక్షనేతగా ఆయన్ను తొలగించింది. ఆ స్థానంలో అజయ్ చౌధరీని నియమించింది. ప్రస్తుతం షిండే తన అనుచరులతో కలిసి గుజరాత్లోని సూరత్ హోటల్లో ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారంతా భాజపాలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. లేదా కొత్త పార్టీ కూడా పెట్టే అంశంపైనా వార్తలు వినిపిస్తున్నాయి.
ఠాణేలో శివసేన ముఖ్య నేత అయిన షిండే.. సంకీర్ణ ప్రభుత్వం(మహా వికాస్ అగాఢీ) తీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో సర్కారు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కన్పిస్తోంది. మరోపక్క మహారాష్ట్రలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ఈ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు తమ తరఫున సీనియర్ నేత కమల్ నాథ్కు బాధ్యతలు అప్పగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ