AP News: క్యాసినో నిర్వహించారో లేదో డీజీపీ చెప్పాలి: వర్ల రామయ్య
కృష్ణాజిల్లా పామర్రు పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నిజనిర్ధారణ కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని మంత్రి
పామర్రు: కృష్ణాజిల్లా పామర్రు పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నిజనిర్ధారణ కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారో లేదో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. గుడివాడ పట్టణంలో వైకాపా నేతలను పోలీసులు కంట్రోల్ చేయలేరా? అని నిలదీశారు. ‘‘బొండా ఉమా కారును ధ్వంసం చేస్తుంటో పోలీసులు ఏం చేస్తున్నారు? తెదేపా నిజనిర్ధారణ కమిటీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటారా? వైకాపా వాళ్లు ఉన్నారు... మీపై దాడి చేస్తారు వెళ్లిపోండి అని పోలీసులే చెబుతున్నారు. పోలీసులు ఉన్నది ఎందుకు? ప్రజలను రక్షించడానికి కాదా? తెదేపా నేతల కార్లు ధ్వంసం చేస్తుంటే నిస్తేజంగా చూస్తూ ఉండిపోయారు. ఇదెక్కడి అన్యాయం. మీకు జీతాలు ఇస్తోంది ప్రజలని గర్తించాలి. భారత రాజ్యాంగం తెలుగుదేశం పార్టీకి వర్తించదా? పోలీసుల కళ్లముందే దాడి జరిగినా పట్టించుకోరా? కొడాలి నాని పక్కన కూర్చునేందుకు సీఎంకు సిగ్గులేదా?’’ అని తీవ్రంగా స్పందించారు.
మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ... గుడివాడలో క్యాసినో, పేకాట శిబిరాలు నడుస్తున్నాయని ఆరోపించారు. వాటికి సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయని తెలిపారు. గుడివాడలో ఏమీ లేకుంటే చూపించేందుకు ఎందుకు భయం?అని ప్రశ్నించారు. కొడాలి నానిని రక్షించేందుకు అందరూ రంగంలోకి దిగారని విమర్శించారు. గంజాయి, డ్రగ్స్.. వైకాపా నేతలకు ఆదాయ వనరుగా మారాయని ఆరోపించారు. అధికార బలంతో ఏదైనా చేస్తామంటే .. న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బొండా ఉమా హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్
Haryana: హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్కు జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌటాలా లేఖ రాశారు. -
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు. -
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి మ్యూజింగ్స్
-
బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ఎనిమిది మంది మృతి!
-
నా ప్రేమ, మద్దతు పవన్కల్యాణ్కే.. అల్లు అర్జున్ పోస్ట్
-
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఎవరు కాదన్నా.. కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్ సింగ్