Andhra Pradesh : సమస్యల నుంచిదృష్టి మళ్లించేందుకే కొత్త జిల్లాల డ్రామా: చంద్రబాబు

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై కేంద్ర దృష్టి పెట్టాలని...

Published : 28 Jan 2022 18:26 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పార్టీ ఎంపీలతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్తోందన్నారు. 28 మంది వైకాపా ఎంపీలు రాష్ట్రానికి ఏం తెచ్చారు? అని ప్రశ్నించారు. పాలన అంటే అప్పు చేయడం, దోచుకోవడం అన్నట్లుగా మారిందని విమర్శించారు. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కొత్త జిల్లాల డ్రామాను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. సీఎం జగన్‌ దిల్లీ పర్యటన ఎవరి కోసం? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని