TDP: హైదరాబాద్ నుంచి ఖమ్మం సభకు చంద్రబాబు.. తెదేపా శ్రేణుల భారీ వాహన ర్యాలీ
ఖమ్మంలో నిర్వహించనున్న తెదేపా శంఖారావానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు.
హైదరాబాద్: ఖమ్మంలో నిర్వహించనున్న తెదేపా శంఖారావానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. తొలుత హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయల్దేరిన తెదేపా అధినేత.. నగరంలోని రసూల్పురా కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ వాహన ర్యాలీతో ఖమ్మం వెళ్లారు. బేగంపేట, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్ మీదుగా ఖమ్మం వైపు తెదేపా ర్యాలీ కొనసాగింది. మార్గంమధ్యలో స్థానిక నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.
ఖమ్మంలోని సర్దార్ పటేల్ మైదానం వేదికగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి కాసాని జ్ఞానేశ్వర్ నియామకం తర్వాత తొలిసారి జరిగే సభను తెదేపా నాయకులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, జెండాలతో ఖమ్మం నగరం పసుపుమయంగా మారింది. ఖమ్మం నగరంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద భారీ ద్విచక్రవాహన ర్యాలీతో అధినేతకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలకనున్నారు. మయూరి సెంటర్ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో చంద్రబాబు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు. అక్కడి నుంచి బహిరంగ సభాస్థలికి చేరుకుని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..