Anam: జగన్ లక్కీ నంబర్ లక్ష: తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి
సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్నాటకాలు ఆడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
నెల్లూరు: సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్నాటకాలు ఆడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. అసలు సాక్షి సంగతే తనకు తెలియదన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
జగన్ లక్కీ నంబర్ లక్ష అని చెప్పిన ఆనం.. రూ. లక్షతో ఆయన పెట్టిన కంపెనీలన్నీ వేల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్ కూడా రూ. లక్ష పెట్టుబడితో పెట్టిందేనని తెలిపారు. ఇందులో రూ. 35వేలు విజయసాయిరెడ్డి, జె. జగన్మోహన్రెడ్డి రూ.30 వేలు, కామత్ అనే మరో వ్యక్తి రూ.35 వేలు పెట్టుబడి పెట్టారని చెప్పారు.
తొలుత విజయసాయిరెడ్డి సాక్షిలో డైరెక్టర్గా ఉన్నారని ఆనం తెలిపారు. ఆయన రాజీనామా చేయగానే జగన్ డైరెక్టర్ అయ్యారని.. ప్రస్తుతం ఆయన సతీమణి భారతీరెడ్డి కొనసాగుతున్నారని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ సంస్థకు డైరెక్టర్గా పని చేశారన్నారు. వీళ్లంతా డైరెక్టర్లుగా ఉంటే జగన్కు సంబంధం లేదా?అని ప్రశ్నించారు. ‘‘లక్ష రూపాయల కంపెనీలు రూ. వేల కోట్లుగా మారాయి. వైఎస్ కుటుంబం మొత్తానికి సాక్షిలో వాటాలు ఉన్నాయి. తనకేమీ సంబంధం లేనట్లు జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు’’ అని ఆనం మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.