సీఎంపై నమ్మకం ఉంది.. దళితబంధు అమలు కాకపోతే ఆత్మహత్య చేసుకుంటా: మోత్కుపల్లి
తెలంగాణలో నూటికి నూరు శాతం దళితబంధు పథకాన్ని అమలు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. అమలు చేస్తారనే నమ్మకం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విశ్వాసం వ్యక్తం చేశారు..
హైదరాబాద్: తెలంగాణలో నూటికి నూరు శాతం దళితబంధు పథకాన్ని అమలు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. అమలు చేస్తారనే నమ్మకం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాటల్లో నిజాయతీ కనిపించిందని.. ఒకవేళ దళితబంధు అమలు కాకపోతే యాదగిరిగుట్ట దగ్గర ఆత్మహత్య చేసుకుంటారన్నారు. ఇతర పార్టీలతో కలిసి దళితబంధుపై రేవంత్ రెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారని.. ఇందుకు నిరసనగా మోత్కుపల్లి నర్సింహులు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ట్యాంక్బండ్ సమీపంలోని లిబర్టీ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి దీక్షకు కూర్చున్నారు.
‘‘రాష్ట్రంలో దళితబంధు పథకం తీసుకురావడం ద్వారా గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సరికొత్త ప్రయత్నాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ఓ మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ ఎవరూ దళితుల సంక్షేమం కోసం పాటుపడలేదు. దళితబంధు పథకం అమలుకు కాంగ్రెస్, భాజపా ఎందుకు అడ్డుపడుతున్నాయి. రేవంత్రెడ్డి తెదేపాను నిలువునా ముంచేశారు. రేవంత్ రెడ్డి వల్లే చంద్రబాబు నాశనం అయ్యారు. రేవంత్ రెడ్డిది శని పాదం’’ అని మోత్కుపల్లి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ